బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్
- February 25, 2017
హైదరాబాద్: అమెరికాలో తెలుగువారిపై జరిగిన దాడులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వంశీ, శ్రీనివాస్, అలోక్ల కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా తన సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దాడులపై విదేశాంగ శాఖతో చర్చిస్తామని తెలిపారు.
కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో జాతి విద్వేషంతో అమెరికన్ జరిపిన కాల్పుల్లో ఇంజనీర్లు శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా, అలోక్కు గాయాలయ్యాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
(చదవండి: అమెరికాలో జాతి విద్వేష కాల్పులు)
గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









