'వరాలసాయి' మందిరంలో వైభవంగా శివకళ్యాణం
- February 25, 2017మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా ప్రత్యేక పూజలు మరియు ప్రవచనాలతో భక్తులు మహాశివుణ్ణి కొలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు చెందిన గూడూరు మండలంలో దత్తక్షేత్రం 'వరాలసాయి' మందిరంలో షిర్డీసాయి ఉపాసకులు పూజ్య దంపతులైన శ్రీ రామ్ రతంజీ మరియు మాత గార్ల ఆధ్వర్యంలో కల్యాణమంటపము నూతనంగా మందిర ఆవరణలో వైభవంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా గురూజీ దంపతులు మరియు పలువురు ప్రముఖులు లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం జరిపించి కళ్యాణమంటప శోభను ఇముడింపజేశారు. పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ మాట్లాడుతూ " మహాశివరాత్రి నాడు శివ కల్యాణంతో ఈ కల్యాణ మండపాన్ని ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందని మరియు వరాల సాయి కృపాకటాక్షాలు అందరిపై ఉండునని" ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు దంపతులతోపాటు రవికుమార్ చోడవరపు దంపతులు, కృష్ణ రంజన్ దంపతులు, గుడ్లవల్లేటి పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







