'వరాలసాయి' మందిరంలో వైభవంగా శివకళ్యాణం
- February 25, 2017మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా ప్రత్యేక పూజలు మరియు ప్రవచనాలతో భక్తులు మహాశివుణ్ణి కొలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు చెందిన గూడూరు మండలంలో దత్తక్షేత్రం 'వరాలసాయి' మందిరంలో షిర్డీసాయి ఉపాసకులు పూజ్య దంపతులైన శ్రీ రామ్ రతంజీ మరియు మాత గార్ల ఆధ్వర్యంలో కల్యాణమంటపము నూతనంగా మందిర ఆవరణలో వైభవంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా గురూజీ దంపతులు మరియు పలువురు ప్రముఖులు లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం జరిపించి కళ్యాణమంటప శోభను ఇముడింపజేశారు. పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ మాట్లాడుతూ " మహాశివరాత్రి నాడు శివ కల్యాణంతో ఈ కల్యాణ మండపాన్ని ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందని మరియు వరాల సాయి కృపాకటాక్షాలు అందరిపై ఉండునని" ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు దంపతులతోపాటు రవికుమార్ చోడవరపు దంపతులు, కృష్ణ రంజన్ దంపతులు, గుడ్లవల్లేటి పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









