మొబైల్ నెంబర్ కోసం 4.5 మిలియన్ దిర్హామ్స్
- February 28, 2017
దుబాయ్కి చెందిన బల్వీందర్ సహానీ, గత ఏడాది డి5 దుబాయ్ నెంబర్ ప్లేట్ కోసం 33 మిలియన్ దిర్హామ్లు వెచ్చించి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఇప్పుడు ఎక్స్క్లూజివ్ డు మొబైల్ నంబర్ కోసం 4.5 మిలియన్ దిర్హామ్లు వెచ్చించి మరోసారి రికారు సృష్టించారు. అయితే దాన్ని తాను పర్సనల్ వినియోగం కోసం వినియోగించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. కేవలం 2 గంటల సమయంలోనే ఆయన వెయ్యికి పైగా కాల్స్ని రిసీవ్ చేసుకున్నారు. తాను వెచ్చించిన మొత్తాన్ని డు సంస్థ ఛారిటీ కోసం వినియోగించనున్నట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అబురాహిమా చెప్పారని అన్నారాయన. ఈ నెంబర్ కోసం ఎంత సొమ్ము అయినాసరే వెచ్చించాలని సహానీ అనుకున్నారట. 4,520,000 దిర్హామ్లు వెచ్చించి 058-8888888 నెంబర్ని ఆక్షన్లో దక్కించుకున్నారు. గ్రాండ్ హయాత్ దుబాయ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆక్షన్ జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







