లాహోర్లో పీఎస్ఎల్ ఫైనల్
- February 28, 2017
లాహోర్: భద్రతపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్ను గడాఫీ స్టేడియంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం పాక్ గడ్డపై పీఎస్ఎల్ టైటిల్ ఫైట్ జరగనుంది. పాలకమండలి సభ్యులతో పీఎస్ఎల్ చైర్మన్ నజమ్ సేథీ చర్చలు జరిపాడు. దేశంలో పెరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతపై సమాలోచన చేసిన అనంతరం పీఎస్ఎల్ ఫైనల్ను గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది. వెంటనే పోలీసులు, ఆర్మీ... స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అయితే, లాహోర్ను ఫైనల్ వేదికగా ఎంచుకోవడాన్ని పాక్ దిగ్గజ పేసర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా తప్పుపట్టాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







