బాలీవుడ్ తార భాగ్యశ్రీ చిక్కుల్లో
- February 28, 2017
మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీపై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు
మహ్మద్ నౌసిఫ్ ఫిర్యాదుతో ముంబైలోని శాంతక్రజ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. గత సెప్టెంబర్లో ముంబైలోని లింక్ రోడ్డుపై నౌసిఫ్ బైక్ని స్కోడా కారు ఢీకొట్టింది. గాయపడిన నౌసీఫ్, ఆసుపత్రిలో చేరాడు. ఎడమ కాలికి గాయకావడంతో అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
ఈ విషయం తెలియగానే హాస్పటల్లోవున్న బాధితుడ్ని భాగ్యశ్రీ భర్త హిమాలయ దసానీ పరామర్శించి, చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పి ఆ తర్వాత మాటమార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై భాగ్యశ్రీ భర్త హిమాలయ్ స్పందించాడు. నౌసీఫ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తమ నుండి అదనపు మనీ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో బాధితుడిపై బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేయడానికి భాగ్యశ్రీ, ఆమె భర్త తమ లాయర్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









