వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది

- March 01, 2017 , by Maagulf
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది.  దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా ఘటనలో 10 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.క్షతగాత్రులను పరామర్శించేందుకు జగన్‌తో పాటు వైసీపీ నేతలు వెళ్ళారు.  ఈ సందర్భంగా అక్కడ వివాదం నెలకొంది.  డాక్టర్లను అడ్డుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 353,506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద జగన్‌తో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com