బీజేపీ నాయకురాలి అరెస్ట్ విదేశాలకు ఆడపిల్లల విక్రయం కేసులో
- March 01, 2017
జల్పాయ్ గురి : ఆడపిల్లలను అక్రమంగా విదేశాలకు విక్రయించిన కేసులో నిందితురాలైన బీజేపీ మహిళా విభాగం నాయకురాలైన జుహీచౌదరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బిమలా శిశు గృహ నుంచి విదేశీ దంపతులకు ఆడపిల్లలను విక్రయించిన కేసులో అరెస్టు అయినవారి సంఖ్య జుహీ చౌదరితో కలిసి నలుగురికి చేరింది. 1 నుంచి 14 ఏళ్ల వయసు గల అమ్మాయిలతో వ్యభిచారం చేయించేందుకు అక్రమంగా విక్రయించారని సీఐడీ అధికారుల బృందం విచారణలో తేలింది. 17 మంది అమ్మాయిలను ఈ ముఠా విక్రయించిందని సీఐడీ అధికారులు చెప్పారు. ఆడపిల్లల విక్రయం కేసులో నిందితురాలైన బీజేపీ మహిళా నాయకురాలు జుహీ చౌదరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







