బీజేపీ నాయకురాలి అరెస్ట్ విదేశాలకు ఆడపిల్లల విక్రయం కేసులో

- March 01, 2017 , by Maagulf
బీజేపీ నాయకురాలి అరెస్ట్ విదేశాలకు ఆడపిల్లల విక్రయం కేసులో

జల్పాయ్ గురి : ఆడపిల్లలను అక్రమంగా విదేశాలకు విక్రయించిన కేసులో నిందితురాలైన బీజేపీ మహిళా విభాగం నాయకురాలైన జుహీచౌదరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బిమలా శిశు గృహ నుంచి విదేశీ దంపతులకు ఆడపిల్లలను విక్రయించిన కేసులో అరెస్టు అయినవారి సంఖ్య జుహీ చౌదరితో కలిసి నలుగురికి చేరింది. 1 నుంచి 14 ఏళ్ల వయసు గల అమ్మాయిలతో వ్యభిచారం చేయించేందుకు అక్రమంగా విక్రయించారని సీఐడీ అధికారుల బృందం విచారణలో తేలింది. 17 మంది అమ్మాయిలను ఈ ముఠా విక్రయించిందని సీఐడీ అధికారులు చెప్పారు. ఆడపిల్లల విక్రయం కేసులో నిందితురాలైన బీజేపీ మహిళా నాయకురాలు జుహీ చౌదరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com