'నేనోరకం' అంటున్న143 హీరో
- March 01, 2017
పూరి దర్శకత్వం లో '143' చిత్రం తో హీరో గా పరిచయం అయినా పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ , హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు. రెండేళ్ల ఓసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నప్పటికీ సక్సెస్ మాత్రం తలుపు తట్టడం లేదు. తాజాగా నేనోరకం అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబదించిన ట్రైలర్ ను రిలీజ్ చేసారు. టైటిల్ కు తగట్టే సాయి యాక్టింగ్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
ఆడియెన్స్ ను అలరించటంతొ పాటు , ఆలొచింపచెసెలా ,కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.
దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్ గా ఉండబోతుందని , సాయిరామ్ శంకర్ -శరత్ కుమార్ ల నటన ,వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను కలగజేస్తాయని చిత్ర యూనిట్ చెపుతున్నారు.
రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







