ఖతార్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
- March 02, 2017
ఖతార్లో 2017 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధమవుతోంది. మార్చ్ 29న ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 8 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్స్ పార్క్, కటారా కల్చరల్ విలేజ్, పెరల్ ఖతార్లలో ఈ ఫెస్టివల్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన సంప్రదాయ వంటకాలు, గల్ఫ్ దేశాల్లోని సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వంటకాలు ఆహూతులకు పసందైన రుచుల్ని అందించనున్నాయి. ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించి పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చుతామని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ చెఫ్లు ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అద్భుతమైన వంటకాలతో ఆహూతుల మన్ననల్ని అందుకోనున్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









