ఖతార్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
- March 02, 2017
ఖతార్లో 2017 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధమవుతోంది. మార్చ్ 29న ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 8 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్స్ పార్క్, కటారా కల్చరల్ విలేజ్, పెరల్ ఖతార్లలో ఈ ఫెస్టివల్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన సంప్రదాయ వంటకాలు, గల్ఫ్ దేశాల్లోని సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వంటకాలు ఆహూతులకు పసందైన రుచుల్ని అందించనున్నాయి. ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించి పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చుతామని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ చెఫ్లు ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అద్భుతమైన వంటకాలతో ఆహూతుల మన్ననల్ని అందుకోనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







