తీవ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరం: కింగ్‌ సల్మాన్‌

- March 03, 2017 , by Maagulf
తీవ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరం: కింగ్‌ సల్మాన్‌

సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌, తీవ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని నినదించారు. ఇండోనేసియా పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50 ఏళ్ళలో సౌదీ కింగ్‌ ఇండోనేసియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1000 మందికి పైగా డెలిగేషన్‌తో, వందలాది టన్నుల లగేజ్‌తో కింగ్‌ సల్మాన్‌ ఇండోనేసియాలో పర్యటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రాజధాని జకార్తాలోని వందలాదిమంది హాజరు కాగా, లెజిస్లేచర్‌ని ఉద్దేశించి కింగ్‌ సల్మాన్‌ ప్రసంగించారు. ముస్లిం సమాజం తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినదించాల్సిన సందర్భమని ఆయన అన్నారు. ఐసిస్‌కి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సౌదీ అరేబియా - సిరియాలో పోరాటం చేస్తోందని చెప్పారాయన. ఇండోనేసియా కూడా ఇస్లామిక్‌ తీవ్రవాదంతో సమస్యలు ఎదుర్కొటున్న దేశమని, ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని చెప్పారు కింగ్‌. జకార్తాలోని ఇస్తిక్‌లాల్‌ మసీదుని సందర్శించారు గురువారం సల్మాన్‌. ఆయన వెంట ప్రెసిడెంట్‌ విదోదో కూడా ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com