తీవ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరం: కింగ్ సల్మాన్
- March 03, 2017
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, తీవ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని నినదించారు. ఇండోనేసియా పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50 ఏళ్ళలో సౌదీ కింగ్ ఇండోనేసియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1000 మందికి పైగా డెలిగేషన్తో, వందలాది టన్నుల లగేజ్తో కింగ్ సల్మాన్ ఇండోనేసియాలో పర్యటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రాజధాని జకార్తాలోని వందలాదిమంది హాజరు కాగా, లెజిస్లేచర్ని ఉద్దేశించి కింగ్ సల్మాన్ ప్రసంగించారు. ముస్లిం సమాజం తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినదించాల్సిన సందర్భమని ఆయన అన్నారు. ఐసిస్కి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సౌదీ అరేబియా - సిరియాలో పోరాటం చేస్తోందని చెప్పారాయన. ఇండోనేసియా కూడా ఇస్లామిక్ తీవ్రవాదంతో సమస్యలు ఎదుర్కొటున్న దేశమని, ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని చెప్పారు కింగ్. జకార్తాలోని ఇస్తిక్లాల్ మసీదుని సందర్శించారు గురువారం సల్మాన్. ఆయన వెంట ప్రెసిడెంట్ విదోదో కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









