తీవ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరం: కింగ్ సల్మాన్
- March 03, 2017
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, తీవ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని నినదించారు. ఇండోనేసియా పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50 ఏళ్ళలో సౌదీ కింగ్ ఇండోనేసియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1000 మందికి పైగా డెలిగేషన్తో, వందలాది టన్నుల లగేజ్తో కింగ్ సల్మాన్ ఇండోనేసియాలో పర్యటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రాజధాని జకార్తాలోని వందలాదిమంది హాజరు కాగా, లెజిస్లేచర్ని ఉద్దేశించి కింగ్ సల్మాన్ ప్రసంగించారు. ముస్లిం సమాజం తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినదించాల్సిన సందర్భమని ఆయన అన్నారు. ఐసిస్కి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సౌదీ అరేబియా - సిరియాలో పోరాటం చేస్తోందని చెప్పారాయన. ఇండోనేసియా కూడా ఇస్లామిక్ తీవ్రవాదంతో సమస్యలు ఎదుర్కొటున్న దేశమని, ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని చెప్పారు కింగ్. జకార్తాలోని ఇస్తిక్లాల్ మసీదుని సందర్శించారు గురువారం సల్మాన్. ఆయన వెంట ప్రెసిడెంట్ విదోదో కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







