కుటుంబాల్ని వెనక్కి పంపుతున్న వలసదారులు
- March 03, 2017
పెద్ద సంఖ్యలో వలసదారులు, తమ కుటుంబ సభ్యుల్ని కువైట్ నుంచి స్వదేశాలకు పంపించేయడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి ప్రదాన కారణం 'కాస్ట్ ఆఫ్ లివింగ్' పెరిగిపోతుండడమే. సేల్స్మెన్గా పనిచేస్తున్న హని అబు ఖత్తామ్ మాట్లాడుతూ, తాను నెలకు 600 కువైట్ దినార్స్ సంపాదిస్తాననీ, కుటుంబాన్ని ఇక్కడే ఉంచి ఆ మొత్తంతో జీవనం గడపలేను గనుక, ఇక్కడే బ్యాచిలర్గా ఉండటానికి నిర్ణయించుకుని, కుటుంబాన్ని ఇండియాకి పంపించేసినట్లు చెప్పారు. 500 కువైటీ దినార్స్ జీతనం సంపాదిస్తోన్న ముస్తపా అత్తియా మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి నివసించడానికి కేవలం రెంట్ రూపంలోనే 280 కువైటీ దినార్స్ చెల్లించవలసి వస్తోందని అందుకే 40 కువైటీ దినార్స్తో బ్యాచిలర్గా ఉంటూ, కుటుంబాన్ని తనకు దూరంగా ఇండియాలో ఉంచానని వివరించారు. కువైట్లో కుటుంబంతో కలిసి సాధారణ జీవనం గడపాలంటే 700 కువైటీ దినార్స్ కన్నా ఎక్కువే ఆర్జించవలసి ఉంటుందని అబు కరీమ్ అనే ఇంకో వ్యక్తి చెప్పారు. ఇంకో వైపున టీచర్లుగా పనిచేస్తున్నవారూ కువైట్లో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వారిపై తొలగింపు నిర్ణయాలతో కాంట్రాక్టులు పునరుద్ధరణ కాక, ఇంటిదారి పడుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







