ఉక్రెయిన్‌ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది

- March 04, 2017 , by Maagulf
ఉక్రెయిన్‌ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది

- ఎనిమిది మంది కార్మికులు మృతి 
కీవ్‌ : ఉక్రెయిన్‌ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సోకాల్‌ జిల్లా వివ్‌ ప్రాంతంలోని ఓ బొగ్గుగనిలో శుక్రవారం ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గుగనిలో 34 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గుగనిలో చిక్కుకున్న మిగతా కార్మికులను రక్షించేందుకు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com