షార్జా, అజ్మాన్లో విడుదల కానున్న ఖైదీలు
- September 22, 2015
వివిధ దేశాలకు సంబంధించిన 132 మంది ఖైదీలు షార్జా ఎమిరేట్స్లో 'ఈద్ అల్ అదా' సందర్భంగా విడుదల కానున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, మరియు షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్, సత్ప్రవరన కలిగిన మరియు సగం శిక్షా కాలం పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయనున్నారు. ఈ విడుదలతో ఖైదీల బంధవుల్లో ఈద్ ఆనందాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. షార్జా చీఫ్ పోలీస్, బ్రిగేడియర్ సైఫ్ మహ్మద్ అల్ జిరి అల్ షామి, షార్జా పాలకుడి చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి తప్పిదాలకూ పాల్పడకుండా మంచి పౌరులుగా జీవిస్తారనీ విడుదల కానున్న ఖైదీల గురించి అభిప్రాయపడ్డారు అల్ షమీ. అజ్మాన్లో 72 మంది ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కౌన్సిల్ మెంబర్, మరియు పాలకుడు షేక్ హుమాయిద్ బిన్ రషిద్ అల్ నువామి నిర్ణయించారు. షేక్ హుమాయిద్ క్షమాభిక్ష ఆ ఖైదీలు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఉపకరిస్తుంది. అజ్మాన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్, బ్రిగేడియర్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ మాట్లాడుతూ, షేక్ హుమాయిద్కి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఖైదీలు విడుదలయ్యాక మేటి పౌరులుగా ప్రవర్తించాలని కోరారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







