షార్జా, అజ్మాన్లో విడుదల కానున్న ఖైదీలు
- September 22, 2015
వివిధ దేశాలకు సంబంధించిన 132 మంది ఖైదీలు షార్జా ఎమిరేట్స్లో 'ఈద్ అల్ అదా' సందర్భంగా విడుదల కానున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, మరియు షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్, సత్ప్రవరన కలిగిన మరియు సగం శిక్షా కాలం పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయనున్నారు. ఈ విడుదలతో ఖైదీల బంధవుల్లో ఈద్ ఆనందాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. షార్జా చీఫ్ పోలీస్, బ్రిగేడియర్ సైఫ్ మహ్మద్ అల్ జిరి అల్ షామి, షార్జా పాలకుడి చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి తప్పిదాలకూ పాల్పడకుండా మంచి పౌరులుగా జీవిస్తారనీ విడుదల కానున్న ఖైదీల గురించి అభిప్రాయపడ్డారు అల్ షమీ. అజ్మాన్లో 72 మంది ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కౌన్సిల్ మెంబర్, మరియు పాలకుడు షేక్ హుమాయిద్ బిన్ రషిద్ అల్ నువామి నిర్ణయించారు. షేక్ హుమాయిద్ క్షమాభిక్ష ఆ ఖైదీలు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఉపకరిస్తుంది. అజ్మాన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్, బ్రిగేడియర్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ మాట్లాడుతూ, షేక్ హుమాయిద్కి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఖైదీలు విడుదలయ్యాక మేటి పౌరులుగా ప్రవర్తించాలని కోరారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







