ఫలక్ నామ ఎక్స్ప్రెస్ లో బాంబు కలకలం
- September 22, 2015
ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలోని హౌరా రైల్వేస్టేషన్ లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు. రైల్లో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లు దాన్ని తనిఖీ చేశారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి, ఆ సిలిండర్ ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్టేషన్ లో ఉన్న సమయంలో రైల్లో పేలుడు సంభవించి ఉంటే, నష్టం తీవ్రత ఎక్కువగానే ఉండేదని నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







