తెలంగాణ వాసికి సౌదీ షేక్ ఆపన్నహస్తం
- March 05, 2017
పదేళ్లుగా జైలుజీవితం గడిపిన ఓ భారతీయుడికి సౌదీ కోర్టు విముక్తి కల్పించింది. అది కూడా అతను 10 లక్షల రియాల్స్ చెల్లిస్తేనే విడిచిపెట్టింది. కానీ డబ్బు చెల్లింపు వెనుకాల సౌదీ యజమాని దాతృత్వం బయటపడింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన చేపూరి లింబాద్రి కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. అనూహ్యంగా అతను ఒక హత్య కేసులో నిందితుడుగా చేర్చబడ్డాడు. దీంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఒకవేళ శిక్ష తప్పించుకోవాలంటే మాత్రం 10 లక్షల రియాల్స్ చెల్లించాలని తీర్పు చెప్పింది. అప్పటినుంచి అతను సుమారు పదేళ్లుగా జైళ్లోనే ఉన్నాడు. అంత డబ్బు తాను కట్టే పరిస్థితులు లేకపోవడంతో, ఇక ఎప్పటికీ తాను స్వదేశానికి వెళ్లలేననుకున్నాడు. కానీ, ఆయన పనిచేస్తున్న కంపెనీ యజమాని సౌదీ షేక్ ఆ మొత్తం డబ్బు చెల్లించారు. అతని విడుదలకు సహాయపడ్డారు. కేంద్రప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమయిందని లింబాద్రి తెలిపాడు. ఈ రోజే హైదరాబాద్ చేరుకున్న ఆయన సౌదీ షేక్కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







