లక్నోలో ఉగ్రవాదులు కలకలం
- March 07, 2017
లక్నోలోని ఠాకూర్గంజ్లో ఉగ్రవాదులు కలకలం రేపారు. ఓ ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని సైఫుల్లాగా పోలీసులు గుర్తించారు. ఓవైపు పోలీస్ ఆపరేషన్ జరుగుతుండగా, మరోవైపు యూపీ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమీక్ష జరుపుతోంది.
తాజా వార్తలు
- టీమ్ఇండియాకు ICC బిగ్ షాక్..
- యూపీఐ కొత్త రూల్స్..యూజర్లకు బిగ్ రిలీఫ్..
- జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్లో డ్రైవర్ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!
- తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..