లక్నోలో ఉగ్రవాదులు కలకలం
- March 07, 2017
లక్నోలోని ఠాకూర్గంజ్లో ఉగ్రవాదులు కలకలం రేపారు. ఓ ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని సైఫుల్లాగా పోలీసులు గుర్తించారు. ఓవైపు పోలీస్ ఆపరేషన్ జరుగుతుండగా, మరోవైపు యూపీ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమీక్ష జరుపుతోంది.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







