ఉపగ్రహాల ప్రయోగంలో చైనా కొత్త పుంతలు!
- March 07, 2017
ఉపగ్రహాల ప్రయోగంలో చైనా వినూత్నంగా ముందుకెళ్లనుంది. సాధారణంగా ప్రత్యేక లాంచ్ ప్యాడ్ ల ద్వారా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను అంతరిక్షంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు విభిన్నంగా ప్రయోగాలు చేయనుంది.
ఏకంగా యుద్ధ విమానాల ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది. వందల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతోపాటు వాణిజ్యపరమైన, శాస్త్రపరమైన లక్ష్యాలను నెరవేర్చుకునే ఉద్దేశంతోనే ఈ దిశగా ముందుకెళుతున్నట్లుగా బీజింగ్ అధికారులు తెలిపినట్లు పేర్కొంది.
లాంచ్ వెహికల్ టెక్నాలజీని అందించే ది చైనా అకాడమీ ప్రస్తుతం 100 కేజీల పేలోడ్ లను మోసుకెళ్లగల సాంద్ర ఇంధన రాకెట్ల పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు రాకెట్ డెవలప్ మెంట్ వ్యవహారాలు చూసుకునే సంస్థ డైరెక్టర్ లి టోంగ్యూ తెలిపారు.
చైనా అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెబుతున్నారని, ఈ కార్యక్రమానికి ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.
అమెరికా, రష్యాలతో పోల్చినప్పుడు ఈ విషయంలో చైనా కొంత వెనకబడి ఉన్నందున వాటికి సమానంగా అంతరిక్ష రంగంలో కూడా దూసుకెళ్లేలా చేయాలని అధ్యక్షుడు ఆదేశించారని లి టోంగ్యూ చెప్పారు.
ఈ నేపథ్యంలో వై-20 వ్యూహాత్మక యుద్ధ విమానాలు మోసుకెళ్లగలిగే రాకెట్ లను సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వరానే రాకెట్ల ప్రయోగాలు జరిపి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నామని వెల్లడించారు.
మరోవైపు చైనా మొట్టమొదటి కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణం ఏప్రిల్ లో మొదలు కానుంది. 2022 నాటికి చైనా కూడా శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







