2017 చివరినాటికి దోహా రోడ్లపై స్మార్ట్ బస్సులు
- March 09, 2017
మోవాసాలత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, తన 'స్మార్ట్ బస్సులు' కీట్ కం 2017 చివరినాటికి దోహా రోడ్లపై పరుగులు పెట్టించనున్నారు. ఆయా బస్సులలో ఎక్కువ భద్రత మరియు సౌకర్యం వంటి లక్షణాలతో ప్రయాణికులను ఆకట్టుకొంటాయి. అధికారికంగా 'స్మార్ట్ బస్సులు' గా పరిచయం కాబడుతున్న ఈ బస్సులను దోహా రహదారులపై ప్రయాణించాలంటే తొలుత ఆ కంపెనీ అధికారుల నుంచి ఆమోదం పొందాల్సి ఉంది మోవాసాలత్ అధికారులు ఈ బస్సులను పరిశీలించారు. ఈ బస్సులు ఆమోదం కనుక పొందితే ఉంటే, 2017 చివరలో దోహా రోడ్ల పై తిరిగి ప్రజలను పెద్ద ఎత్తున తప్పక ఆకర్షిస్తాయని మోవాసాలత్ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ శాఖ అధికారి తెలిపారు. ఈ కొత్త బస్సులలో ప్రయాణాలు ఎంతో సౌకర్యవంతమైన రీతిలో ఉండటానికి రూపొందించబడ్డాయి తాజా సాంకేతిక మరియు అదే సమయంలో సురక్షితమైన భద్రతా ప్రమాణాలతో రూపొందించబడ్డాయి. ఈ బస్సులు నడుస్తున్నప్పుడు లోపల ఏర్పాటు చేసిన విస్తృత డిజిటల్ తెరలలో ప్రయాణికుల సౌకర్యార్థం రాబోయే విరామాలలో చూపిస్తాయి. అన్ని 'స్మార్ట్ బస్సుల' లో ఒక నిర్దిష్ట గమ్యానికి దూరం మరియు అంచనా వేయబడి ఆ ప్రదేశానికి చేరుకొనే సమయం సైతం ప్రయాణికులకు డిజిటల్ తెరలపై చూపిస్తుంది. అలాగే రోడ్ల పరిస్థుతుల గురించి ముందుకు వెళ్లడం ఎలా సాధ్యం అవుతుందో తెలియచేస్తుంది అలాగే ట్రాఫిక్ జామ్లు మొదలైన సమాచారం డ్రైవర్ కు తెలియజేస్తుంది ప్రతి 'స్మార్ట్-బస్' లలో ఒక నిఘా కెమెరా ఉంటుంది. ఆ సమయంలో బస్సులు నియంత్రించడమే కాక సమర్ధవంతంగా నిర్వహించబడుతుంది. ఈ విధానంతో ప్రయాణికుడు ఒక వెళ అవసరమైతే నేరుగా మోవాసాలత్ ప్రధాన కార్యాలయం వద్ద కస్టమర్ కేర్ ని సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









