ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- October 18, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల కోసం చట్టాలలో సంస్కరణలకు శ్రీకారం చుట్టుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒమన్ను ప్రముఖ గమ్యస్థానంగా చేసేందుకు అవసరమైన అదనపు ప్రోత్సాహకాలను అందించడంతో పాటు పోర్టులు, ఫ్రీ జోన్లు, రోడ్ నెట్వర్క్లు మరియు లాజిస్టిక్స్ సేవలను ఆధునీకరించడం వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్రకటించారు.
ఒమన్లో పెట్టుబుడులు పెట్టేందుకు అవసరమైన అనుమతుల కోసం డిజిటల్ వ్యవస్థ ను ప్రవేశపెట్టింది. ఇది టైటిల్ డీడ్లను వేగవంతంగా జారీ చేస్తుందని తెలిపారు. మస్కట్ మునిసిపాలిటీ వంటి మునిసిపాలిటీలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కు అనుగుణంగా సంబంధిత అధికారులతో సమన్వయంతో అనుమతులు జారీ అవుతాయని పేర్కొంది.
మరోవైపు, ఒమన్ ఇంధన మరియు విద్యుత్ రంగాలలో కూడా గణనీయమైన పురోగతిని సాధించింది. 5G నెట్వర్క్ల అమలు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల మెరుగుదల పెట్టుబడి కేంద్రంగా ఒమన్ పోటీతత్వ స్థాయిని మరింత పెంచిందన్నారు. సామాజిక భద్రత, అధిక జీవన ప్రమాణాలు వంటివి ఒమన్ స్థానాన్ని మెరుగైన స్థితిలో పెడుతుందని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఆర్థిక నిపుణుడు మరియు ఒమన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ అబ్దుల్సలాం ఫరాజ్ యాహ్యా తెలిపారు. ప్రభుత్వ మీడియం-టర్మ్ ఫిస్కల్ బ్యాలెన్స్ ప్లాన్, “నజ్దహిర్” నేషనల్ ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ప్లాన్ మరియు ఎక్స్పోర్ట్ సపోర్ట్ అండ్ ప్రమోషన్ సెంటర్ వంటి వివిధ విధానాలను అమలు చేసిందని, ఇవన్నీ పెట్టుబడులు మరియు వ్యాపార వాతావరణాన్ని గణనీయంగా మెరుగుపరిచాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







