కువైట్లో 36 కిలోమీటర్ల భారీ వంతెన
- March 09, 2017
పశ్చిమ ఆసియా దేశమైన కువైట్ భారీ వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఉత్తరాన మారుమూల ప్రాంతమైన సుబియాని అభివృద్ధి చేస్తూ సిల్క్సిటీ ఏర్పాటు లక్ష్యంగా 36 కి.మీ. మేర ఈ వంతెనను నిర్మిస్తున్నది. కువైట్ ప్రభుత్వం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణానికి 3 బిలియన్ డాలర్లు ( రూ.20,017 కోట్లు ) ఖర్చు చేస్తున్నది. గల్ఫ్ప్రాంతానికి మధ్య ఆసియా, యూరోప్తో అనుసంధానించే పురాతన సిల్క్ రోడ్కు నూతన శక్తిని ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణం ఇప్పటికే దాదాపు మూడు వంతులు పూర్తయింది. దీని నిర్మాణం పూర్తయినట్టయితే కువైట్ నగరం నుంచి సుబియా ప్రాంతాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.ప్రస్తుతం సుబియాని చేరుకునేందుకు 90 నిమిషాల సమయం పడుతున్నది.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం