కువైట్లో 36 కిలోమీటర్ల భారీ వంతెన
- March 09, 2017
పశ్చిమ ఆసియా దేశమైన కువైట్ భారీ వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఉత్తరాన మారుమూల ప్రాంతమైన సుబియాని అభివృద్ధి చేస్తూ సిల్క్సిటీ ఏర్పాటు లక్ష్యంగా 36 కి.మీ. మేర ఈ వంతెనను నిర్మిస్తున్నది. కువైట్ ప్రభుత్వం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణానికి 3 బిలియన్ డాలర్లు ( రూ.20,017 కోట్లు ) ఖర్చు చేస్తున్నది. గల్ఫ్ప్రాంతానికి మధ్య ఆసియా, యూరోప్తో అనుసంధానించే పురాతన సిల్క్ రోడ్కు నూతన శక్తిని ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణం ఇప్పటికే దాదాపు మూడు వంతులు పూర్తయింది. దీని నిర్మాణం పూర్తయినట్టయితే కువైట్ నగరం నుంచి సుబియా ప్రాంతాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.ప్రస్తుతం సుబియాని చేరుకునేందుకు 90 నిమిషాల సమయం పడుతున్నది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







