కువైట్లో 36 కిలోమీటర్ల భారీ వంతెన
- March 09, 2017
పశ్చిమ ఆసియా దేశమైన కువైట్ భారీ వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఉత్తరాన మారుమూల ప్రాంతమైన సుబియాని అభివృద్ధి చేస్తూ సిల్క్సిటీ ఏర్పాటు లక్ష్యంగా 36 కి.మీ. మేర ఈ వంతెనను నిర్మిస్తున్నది. కువైట్ ప్రభుత్వం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణానికి 3 బిలియన్ డాలర్లు ( రూ.20,017 కోట్లు ) ఖర్చు చేస్తున్నది. గల్ఫ్ప్రాంతానికి మధ్య ఆసియా, యూరోప్తో అనుసంధానించే పురాతన సిల్క్ రోడ్కు నూతన శక్తిని ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణం ఇప్పటికే దాదాపు మూడు వంతులు పూర్తయింది. దీని నిర్మాణం పూర్తయినట్టయితే కువైట్ నగరం నుంచి సుబియా ప్రాంతాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.ప్రస్తుతం సుబియాని చేరుకునేందుకు 90 నిమిషాల సమయం పడుతున్నది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







