గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- October 18, 2025
జెనీవా: యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) గాజా స్ట్రిప్లోకి వెళ్లే అన్ని సరిహద్దు క్రాసింగ్లను తెరవాలని కోరింది. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఇది సహాయ పడుతుందని WFP ప్రతినిధి అబీర్ ఎటెఫా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు పంపిణీ కేంద్రాలు నివాసితులకు దగ్గరగా పనిచేస్తున్నాయని, వాటిని త్వరలోనే 145 కేంద్రాలకు విస్తరించాలనే ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు.
కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి రోజుకు సగటున 560 టన్నుల ఆహార సహాయం గాజాలోకి ప్రవేశించిందని, అయితే ఇది అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉందని ఎటెఫా చెప్పారు. యుద్ధంలో రోడ్లు దెబ్బతిన్న కారణంగా దక్షిణ ప్రాంతానికి ఫుడ్ ట్రక్కులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాజాగా దక్షిణ మరియు మధ్య గాజాకు 57 ట్రక్కులు చేరుకున్నాయని, ఇది ఒక కీలక పరిణామమని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









