గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- October 18, 2025
జెనీవా: యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) గాజా స్ట్రిప్లోకి వెళ్లే అన్ని సరిహద్దు క్రాసింగ్లను తెరవాలని కోరింది. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఇది సహాయ పడుతుందని WFP ప్రతినిధి అబీర్ ఎటెఫా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు పంపిణీ కేంద్రాలు నివాసితులకు దగ్గరగా పనిచేస్తున్నాయని, వాటిని త్వరలోనే 145 కేంద్రాలకు విస్తరించాలనే ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు.
కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి రోజుకు సగటున 560 టన్నుల ఆహార సహాయం గాజాలోకి ప్రవేశించిందని, అయితే ఇది అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉందని ఎటెఫా చెప్పారు. యుద్ధంలో రోడ్లు దెబ్బతిన్న కారణంగా దక్షిణ ప్రాంతానికి ఫుడ్ ట్రక్కులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాజాగా దక్షిణ మరియు మధ్య గాజాకు 57 ట్రక్కులు చేరుకున్నాయని, ఇది ఒక కీలక పరిణామమని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







