గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- October 18, 2025
జెనీవా: యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) గాజా స్ట్రిప్లోకి వెళ్లే అన్ని సరిహద్దు క్రాసింగ్లను తెరవాలని కోరింది. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఇది సహాయ పడుతుందని WFP ప్రతినిధి అబీర్ ఎటెఫా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు పంపిణీ కేంద్రాలు నివాసితులకు దగ్గరగా పనిచేస్తున్నాయని, వాటిని త్వరలోనే 145 కేంద్రాలకు విస్తరించాలనే ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు.
కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి రోజుకు సగటున 560 టన్నుల ఆహార సహాయం గాజాలోకి ప్రవేశించిందని, అయితే ఇది అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉందని ఎటెఫా చెప్పారు. యుద్ధంలో రోడ్లు దెబ్బతిన్న కారణంగా దక్షిణ ప్రాంతానికి ఫుడ్ ట్రక్కులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాజాగా దక్షిణ మరియు మధ్య గాజాకు 57 ట్రక్కులు చేరుకున్నాయని, ఇది ఒక కీలక పరిణామమని తెలిపారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









