బుధవారం నుండి రొయ్యల వేటపై 6 నెలల పాటు నిషేధం
- March 11, 2017
కింగ్డమ్ లో సముద్ర వనరులను రక్షించే ప్రయత్నంలో భాగంగా రొయ్యలపై వార్షిక నిషేధం బుధవారం నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ప్రతిపాదన సంఖ్య 27 2017 ప్రకారం సముద్ర ప్రాణులు మరియు తాజా రొయ్యలు అమ్మకంను బుధవారం నుండి సెప్టెంబర్ 15 వరకు నిషేధించినట్లు వర్క్స్, పురపాలక వ్యవహారాల అర్బన్ ప్లానింగ్ మంత్రి ఇస్సామ్ ఖలాఫ్ ప్రకటించారు.ఈ మేరకు గురువారం అధికార గెజిట్లో ప్రచురించబడింది. దీని ప్రకారం స్థానిక మార్కెట్లలో యధాతధంగా సముద్ర జీవులు ,తాజా చిన్నరొయ్యలను విక్రయించరాదు.అంతే కాక సముద్రంలో జలచరాలను రొయ్యలను పట్టుకోవడంలో ఉపయోగించే వలలు, మర పడవలు తదితర పరికరాలు మరియు ఉపకరణాలను ఆరు నెలల పాటు నిషేధం విధించారు. ఆ సమయంలో ఎవరైనా సముద్రంలో వేటాడం చట్టవిరుద్ధ చర్యగా మార్చి 7 వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనబడిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై బహెరిన్ చట్ట ప్రకారం విధించబడే చర్యలకు వారే బాధ్యులని హెచ్చరించారు. ప్రతి ఏటా సముద్ర వనరులను రక్షించడానికి మరియు జీవుల పునరుత్పత్తి ప్రక్రియను అనుమతించేందుకు నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి రొయ్యలను వేటాడటం నిషేధం అని తెలిపారు. ఈ తరహా నిర్ణయాలు కువైట్ ప్రాంతములోని ఇతర దేశాల్లోనూ అమలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







