ప‌వ‌న్ అరుదైన కానుక‌ ఎన్ ఆర్ ఐ అభిమానుల‌ కోసం

- March 12, 2017 , by Maagulf
ప‌వ‌న్ అరుదైన కానుక‌  ఎన్ ఆర్ ఐ అభిమానుల‌ కోసం

ఎన్ ఆర్ ఐ అభిమానుల‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అరుదైన కానుక అందించాడు. జనసేన అధినేత ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ -2017 కార్యక్రమానికి హాజర‌య్యాడు. అక్కడ పవన్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. న్యాష్ విల్ అనే టౌన్ నుండి వందల కార్లలో ర్యాలీగా పవన్ ని తీసుకువెళ్ళారు. తన పై ఇంత అభిమానం చూపించిన అభిమానులకు పవన్ ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని తాను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి మరీ పంపించాడు.
ఆధునిక మహాభారతం పుస్తకం కాపీలు మార్కెట్లో అందుబాటులో లేక‌పోవ‌డంతో పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బులు వెచ్చింది ఈ పుస్తకం ప్రతులను ప్రింటింగ్ చేయించి త‌న అభిమానుల‌కు కానుక‌గా పంపించాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com