భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా
- March 12, 2017
చంద్రుడి మీద కాలుమోపడం కోసం, వివిధ అంతరిక్ష పరిశోధనల కోసం కొత్తగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్స్టేషన్) నిర్మించబోతున్నట్టు చైనా ప్రకటించింది. భూమి నుంచి తక్కువ ఎత్తు లోని కక్షలో దీనిని నిర్మించనున్నారని, చంద్రుడిపైకి రాకపోకలను ఉద్దేశించి ఈ ప్రాజెక్టు చేపట్టామని,ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 5 ఏండ్లలో పూర్తిచేయాలన్నది లక్ష్యమని చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 'సైన్స్ అండ్ టెక్నాలజీ' డెయిలీ న్యూస్ వార్తల్ని ప్రచురిం చింది.కొత్తగా నిర్మించ బోతున్న స్పేస్స్టేషన్ కు ఇంకా పేరు పెట్టలేదు. పెద్ద సంఖ్యలో వ్యోమగాము లు ఉండటానికి స్పేస్స్టేషన్ లో ఓ గది కూడా ఉం టుందని ప్రాజెక్టు ఇంజనీర్ జాంగ్ బెనైన్ చెప్పారు.
ప్రస్తుతం అంతరిక్షంలో 'షెంజో' అనే స్పేస్స్టేషన్ పనిచేస్తున్నది. రష్యాకు చెందిన సూయజ్ తరహాలో దీనిని డిజైన్ చేశారు. అయితే 'షెంజో'లో కేవలం ముగ్గురు వ్యోమగాములు మాత్రమే ఉండటానికి వీలు ఉంది. 2003 నుంచి 'షెంజో' పూర్తిస్థాయిలో పనిచేయటం ఆరంభిం చింది.
ఈ తరహాలోనే మరోటి పెద్దదైన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చైనా నిర్ణయించుకుంది. దీని ద్వారా ముందు ముందు చంద్రుడి మీదకు ప్రయాణాలు చేయాలన్నది ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







