దుబాయ్ క్రీక్, దుబాయ్ వాటర్ కెనాల్ ఈదిన తొలి సౌదీ మహిళ
- March 13, 2017
సౌదీ డెంటిస్ట్, హ్యుమానిటేరియన్ డాక్టర్ మరియమ్ సలెహ్ బిన్లాడెన్, దుబాయ్ క్రీక్ని అలాగే దుబాయ్ కెనాల్నీ దాటిన తొలి సౌదీ మహిళగా రికార్డులకెక్కారు. మొత్తం 24 కిలోమీటర్ల మేర ఆమె ఈ సాహసం చేయడం గమనించదగ్గది. మార్చ్ 10న ఈ అద్భుతాన్ని ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, దుబాయ్ మెరిటైమ్ అథారిటీ, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ పోలీస్, మెరైన్ రెస్క్యూ సంయుక్తంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ ద్వారా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ అద్భుతాన్ని తిలకించారు. ఉదయం 5 గంటల సమయంలో డాక్టర్ మరియం ఈ సాహసాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఆమె తన సాహసాన్ని పూర్తి చేశారు. మొత్తం 9 గంటల 10 నిమిషాలపాటు ఈ సాహసం కొనసాగింది. ఈ సందర్బంగా డాక్టర్ మరియమ్ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఆమె తెగువని కొనియాడారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









