దుబాయ్ క్రీక్, దుబాయ్ వాటర్ కెనాల్ ఈదిన తొలి సౌదీ మహిళ
- March 13, 2017
సౌదీ డెంటిస్ట్, హ్యుమానిటేరియన్ డాక్టర్ మరియమ్ సలెహ్ బిన్లాడెన్, దుబాయ్ క్రీక్ని అలాగే దుబాయ్ కెనాల్నీ దాటిన తొలి సౌదీ మహిళగా రికార్డులకెక్కారు. మొత్తం 24 కిలోమీటర్ల మేర ఆమె ఈ సాహసం చేయడం గమనించదగ్గది. మార్చ్ 10న ఈ అద్భుతాన్ని ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, దుబాయ్ మెరిటైమ్ అథారిటీ, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ పోలీస్, మెరైన్ రెస్క్యూ సంయుక్తంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ ద్వారా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ అద్భుతాన్ని తిలకించారు. ఉదయం 5 గంటల సమయంలో డాక్టర్ మరియం ఈ సాహసాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఆమె తన సాహసాన్ని పూర్తి చేశారు. మొత్తం 9 గంటల 10 నిమిషాలపాటు ఈ సాహసం కొనసాగింది. ఈ సందర్బంగా డాక్టర్ మరియమ్ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఆమె తెగువని కొనియాడారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







