ఒమాన్ లో కార్మిక చట్టంను ఉల్లంఘించిన 500 మంది అరెస్ట్
- March 13, 2017
మస్కట్ : కార్మిక చట్టంను ఉల్లంఘించిన 500 మంది కంటే ఎక్కువ మందిని వారాంతపు తనిఖీలో భాగంగా మానవ వనురుల మంత్రిత్వశాఖ అరెస్టు చేశారు. మార్చి 5 వ తేదీ నుండి మార్చి 11 వ తేదీ మధ్య కాలంలో మంత్రిత్వ శాఖ సంయుక్త తనిఖీ జట్టు,భద్రతా సిబ్బంది సహకారంతో ఈ దాడులు నిర్వహించారు. ఆ కాలంలో 548 మంది కార్మిక చట్టంఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేశారు. వీరిలో 412 మంది వాణిజ్య కార్మికులు, 62 మంది రైతులు, 74 మంది ఇళ్లలో పనిచేసే దేశీయ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా మంత్రిత్వ శాఖ జట్టు, 509 మందిపై నేర పరిశోధన జరిపే నిమిత్తం అరెస్టు చేశారు. వీరిలో 310 మంది వారి యజమానులు నుండి పరారైన వారు కాగా,176 మందిని విడుదల చేయగా,23 మంది చట్టపరమైన పత్రాలను తమ వెంట ఉంచుకోనందున అరెస్ట్ చేయబడ్డారు .మస్కట్ గవర్నేట్ పరిధిలో145 మందిని అరెస్టు చేయడంతో అది అత్యధిక సంఖ్యగా నమోదు కాబడింది. ఆ తర్వాత ఉత్తర అల్ బత్తినహ గవర్నేట్ పరిధిలో127 మంది నమోదు కాబడ్డారు. ఇందుకు బాధ్యులైన అధికారులు అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదే కాలంలో కార్మిక చట్టంని ఉల్లంఘించిన 451మందిని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు తో అప్పగించి ఆ తరువాత దేశము నుండి వారిని బహిష్కరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







