సరదాగా నడిచిపోయే సినిమా 'రోగ్'
- March 13, 2017
‘రోగ్’ మరో చంటిగాడి ప్రేమ కథ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పాటల వేడుక సోమవారం రాత్రి జరిగింది. దర్శకులు వి.వి.వినాయక్, క్రిష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత తీసిన సరదాగా నడిచిపోయే సినిమా రోగ్ అని చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. హీరో ఇషాన్ బాగా నటిచాడన్నారు. మరో 50 సినిమాల్లో నటిస్తాడని, 20 ఏళ్ల వరకు కష్టపడే సత్తా అతడికి ఉందన్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మంచి సంగీత బాణీలు అందించారన్నారు. గేయ రచయిత భాస్కరబట్ల అద్భుతంగా పాటలు రాశారన్నారు. ఆడియో మంచి హిట్ అవుతుందని పేర్కొన్నారు. చిత్ర కథానాయికలు మన్నారా చోప్రా, ఏంజిలా సినిమాలో అందంగా కనిపించారన్నారు.
కథానాయకుడు ఇషాన్ మాట్లాడుతూ తన కుటుంబం వల్లే ఈ సినిమాలో నటించగలిగానని పేర్కొన్నాడు. నటనలో ఓనమాలు నేర్పిన సత్యానంద్ గురువు రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నాడు. సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









