సరదాగా నడిచిపోయే సినిమా 'రోగ్'
- March 13, 2017
‘రోగ్’ మరో చంటిగాడి ప్రేమ కథ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పాటల వేడుక సోమవారం రాత్రి జరిగింది. దర్శకులు వి.వి.వినాయక్, క్రిష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత తీసిన సరదాగా నడిచిపోయే సినిమా రోగ్ అని చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. హీరో ఇషాన్ బాగా నటిచాడన్నారు. మరో 50 సినిమాల్లో నటిస్తాడని, 20 ఏళ్ల వరకు కష్టపడే సత్తా అతడికి ఉందన్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మంచి సంగీత బాణీలు అందించారన్నారు. గేయ రచయిత భాస్కరబట్ల అద్భుతంగా పాటలు రాశారన్నారు. ఆడియో మంచి హిట్ అవుతుందని పేర్కొన్నారు. చిత్ర కథానాయికలు మన్నారా చోప్రా, ఏంజిలా సినిమాలో అందంగా కనిపించారన్నారు.
కథానాయకుడు ఇషాన్ మాట్లాడుతూ తన కుటుంబం వల్లే ఈ సినిమాలో నటించగలిగానని పేర్కొన్నాడు. నటనలో ఓనమాలు నేర్పిన సత్యానంద్ గురువు రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నాడు. సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









