సరదాగా నడిచిపోయే సినిమా 'రోగ్'
- March 13, 2017
‘రోగ్’ మరో చంటిగాడి ప్రేమ కథ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పాటల వేడుక సోమవారం రాత్రి జరిగింది. దర్శకులు వి.వి.వినాయక్, క్రిష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత తీసిన సరదాగా నడిచిపోయే సినిమా రోగ్ అని చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. హీరో ఇషాన్ బాగా నటిచాడన్నారు. మరో 50 సినిమాల్లో నటిస్తాడని, 20 ఏళ్ల వరకు కష్టపడే సత్తా అతడికి ఉందన్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మంచి సంగీత బాణీలు అందించారన్నారు. గేయ రచయిత భాస్కరబట్ల అద్భుతంగా పాటలు రాశారన్నారు. ఆడియో మంచి హిట్ అవుతుందని పేర్కొన్నారు. చిత్ర కథానాయికలు మన్నారా చోప్రా, ఏంజిలా సినిమాలో అందంగా కనిపించారన్నారు.
కథానాయకుడు ఇషాన్ మాట్లాడుతూ తన కుటుంబం వల్లే ఈ సినిమాలో నటించగలిగానని పేర్కొన్నాడు. నటనలో ఓనమాలు నేర్పిన సత్యానంద్ గురువు రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నాడు. సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







