వేసవిలో ఉదయం పూట అల్పాహారంలో నూనె వద్దే వద్దు..
- March 13, 2017
వేసవి కాలం వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ కాలంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే టిఫిన్స్ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవడం ఉత్తమం. బార్లీ గింజల్లో నీరు పోసి ఉడికించి.. ఆపై అందులో ఉప్పు లేదా బెల్లం, నిమ్మరసం కానీ వేసుకుని తాగితే చలవ చేస్తుంది. ఈ నీరు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎండాకాలంలో చెర్రీ, బెర్రీలు.. బొప్పాయి, యాపిల్ వంటి పండ్లతో పాటు నిమ్మజాతి పండ్లు.. ఎండు ద్రాక్షలు, ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. రోజూ ఒక గ్లాసుడు నిమ్మరసంలో పుదీనా చేర్చి తీసుకోవడం ద్వారా నీరసం తగ్గిపోతుంది. ఇంకా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే వాటర్మెలాన్ జ్యూస్ రోజూ తీసుకోండి. 90 శాతం ఇందులో నీటి శాతం ఉండటం ద్వారా శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









