వేసవిలో ఉదయం పూట అల్పాహారంలో నూనె వద్దే వద్దు..
- March 13, 2017
వేసవి కాలం వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ కాలంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే టిఫిన్స్ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవడం ఉత్తమం. బార్లీ గింజల్లో నీరు పోసి ఉడికించి.. ఆపై అందులో ఉప్పు లేదా బెల్లం, నిమ్మరసం కానీ వేసుకుని తాగితే చలవ చేస్తుంది. ఈ నీరు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎండాకాలంలో చెర్రీ, బెర్రీలు.. బొప్పాయి, యాపిల్ వంటి పండ్లతో పాటు నిమ్మజాతి పండ్లు.. ఎండు ద్రాక్షలు, ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. రోజూ ఒక గ్లాసుడు నిమ్మరసంలో పుదీనా చేర్చి తీసుకోవడం ద్వారా నీరసం తగ్గిపోతుంది. ఇంకా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే వాటర్మెలాన్ జ్యూస్ రోజూ తీసుకోండి. 90 శాతం ఇందులో నీటి శాతం ఉండటం ద్వారా శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







