బాంబు కలకలం అమృత్సర్ ఎయిర్పోర్టులో
- March 15, 2017
విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు కలకలం రేగడంతో అమృత్సర్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలు నిలిపివేశారు. పార్కింగ్ ప్రాంతంలో ఓ సూట్ కేసు అనుమానాస్పదంగా పడి ఉండడంతో అందులో ఏముందోనని భయాందోళనలు చెలరేగాయి. అది ప్రమాదకరమైందో కాదో పరీక్షించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. ఆ ప్రాంతం మొత్తం తనిఖీలు చేసిన అధికారులు ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించారు. దేశవ్యతిరేక శక్తులు సంచరిస్తున్నాయంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో పఠాన్ కోట్ వైమానిక స్థావరంతో పాటు, మమన్ కంటోన్మెంట్లో రెండురోజులుగా భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమృత్సర్లోని శ్రీ గురురామ్ దాస్జీ అంతర్జాతీయ విమాశ్రయంలో అనుమానాస్పద సూట్కేజు దర్శనమివ్వడం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









