బాంబు కలకలం అమృత్సర్ ఎయిర్పోర్టులో
- March 15, 2017
విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు కలకలం రేగడంతో అమృత్సర్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలు నిలిపివేశారు. పార్కింగ్ ప్రాంతంలో ఓ సూట్ కేసు అనుమానాస్పదంగా పడి ఉండడంతో అందులో ఏముందోనని భయాందోళనలు చెలరేగాయి. అది ప్రమాదకరమైందో కాదో పరీక్షించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. ఆ ప్రాంతం మొత్తం తనిఖీలు చేసిన అధికారులు ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించారు. దేశవ్యతిరేక శక్తులు సంచరిస్తున్నాయంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో పఠాన్ కోట్ వైమానిక స్థావరంతో పాటు, మమన్ కంటోన్మెంట్లో రెండురోజులుగా భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమృత్సర్లోని శ్రీ గురురామ్ దాస్జీ అంతర్జాతీయ విమాశ్రయంలో అనుమానాస్పద సూట్కేజు దర్శనమివ్వడం గమనార్హం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







