31 మంది మృతి సిరియాలో ఆత్మాహుతి దాడి
- March 15, 2017
సిరియాలో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రాజధాని డమాస్కస్లో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మొత్తం 31 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొదటి ఆత్మాహుతి దాడి రాజధాని డమాస్కస్లోని ప్రధాన కోర్టు వద్ద జరిగింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ సూసైడ్ బాంబర్ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సూసైడ్ బాంబర్ అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో 31 మంది మరణించారు. లాయర్లు, జడ్జిలు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రెండో ఆత్మాహుతి దాడి నగరంలోని ఓ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. ఈ దాడిలో ఎవరూ మరణించకున్నా.. పలువురికి గాయాలయ్యాయి. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమై ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోయాయి. అసద్ బలగాలు, ఐసిస్ల మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది పౌరులు మరణించారు. సుమారు 4 లక్షల మందికి పైగా పౌరులు దేశాన్ని వదిలిపెట్టిపోయారు. అయినా సిరియా నరమేధం ఇప్పట్లో ముగిసేలా లేదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







