31 మంది మృతి సిరియాలో ఆత్మాహుతి దాడి
- March 15, 2017
సిరియాలో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రాజధాని డమాస్కస్లో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మొత్తం 31 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొదటి ఆత్మాహుతి దాడి రాజధాని డమాస్కస్లోని ప్రధాన కోర్టు వద్ద జరిగింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ సూసైడ్ బాంబర్ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సూసైడ్ బాంబర్ అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో 31 మంది మరణించారు. లాయర్లు, జడ్జిలు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రెండో ఆత్మాహుతి దాడి నగరంలోని ఓ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. ఈ దాడిలో ఎవరూ మరణించకున్నా.. పలువురికి గాయాలయ్యాయి. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమై ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోయాయి. అసద్ బలగాలు, ఐసిస్ల మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది పౌరులు మరణించారు. సుమారు 4 లక్షల మందికి పైగా పౌరులు దేశాన్ని వదిలిపెట్టిపోయారు. అయినా సిరియా నరమేధం ఇప్పట్లో ముగిసేలా లేదు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









