31 మంది మృతి సిరియాలో ఆత్మాహుతి దాడి
- March 15, 2017
సిరియాలో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రాజధాని డమాస్కస్లో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మొత్తం 31 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొదటి ఆత్మాహుతి దాడి రాజధాని డమాస్కస్లోని ప్రధాన కోర్టు వద్ద జరిగింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ సూసైడ్ బాంబర్ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సూసైడ్ బాంబర్ అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో 31 మంది మరణించారు. లాయర్లు, జడ్జిలు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రెండో ఆత్మాహుతి దాడి నగరంలోని ఓ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. ఈ దాడిలో ఎవరూ మరణించకున్నా.. పలువురికి గాయాలయ్యాయి. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమై ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోయాయి. అసద్ బలగాలు, ఐసిస్ల మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది పౌరులు మరణించారు. సుమారు 4 లక్షల మందికి పైగా పౌరులు దేశాన్ని వదిలిపెట్టిపోయారు. అయినా సిరియా నరమేధం ఇప్పట్లో ముగిసేలా లేదు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









