విజేతగా నిలిచిన ఫెదరర్ మరోసారి నాదల్పై
- March 16, 2017
టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ మరోసారి విజేతగా నిలిచాడు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ తలపడ్డారు. వీరిద్దరూ ఇలా తలపడటం ఇది 36వ సారి కావడం విశేషం. అయితే 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ పైచేయి సాధించాడు. వరుస సెట్లలో 6-2, 6-3తో నాదల్పై ఫెదరర్ అలవోక విజయాన్ని సాధించాడు.
తొలి సెట్లో ఫెదరర్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు నాదల్. అయితే రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్నా మ్యాచ్ జేజారిపోయింది.
నాదల్పై విజయం సాధించడంతో రోజర్ ఫెదరర్ సెమీస్కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం నాదల్ మీడియాతో మాట్లాడాడు.
'ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలోఓటమి పాలయ్యాను. అది గెలవాల్సిన మ్యాచ్. ప్రస్తుతం ముగిసిన మ్యాచ్లో ఫెదరర్ నాకంటే చాలా బాగా ఆడాడు' అని నాదల్ పేర్కొన్నాడు. ఫెదరర్ సెమీస్లో కిర్గియోస్తో తలపడనున్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









