విజేతగా నిలిచిన ఫెదరర్ మరోసారి నాదల్పై
- March 16, 2017
టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ మరోసారి విజేతగా నిలిచాడు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ తలపడ్డారు. వీరిద్దరూ ఇలా తలపడటం ఇది 36వ సారి కావడం విశేషం. అయితే 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ పైచేయి సాధించాడు. వరుస సెట్లలో 6-2, 6-3తో నాదల్పై ఫెదరర్ అలవోక విజయాన్ని సాధించాడు.
తొలి సెట్లో ఫెదరర్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు నాదల్. అయితే రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్నా మ్యాచ్ జేజారిపోయింది.
నాదల్పై విజయం సాధించడంతో రోజర్ ఫెదరర్ సెమీస్కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం నాదల్ మీడియాతో మాట్లాడాడు.
'ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలోఓటమి పాలయ్యాను. అది గెలవాల్సిన మ్యాచ్. ప్రస్తుతం ముగిసిన మ్యాచ్లో ఫెదరర్ నాకంటే చాలా బాగా ఆడాడు' అని నాదల్ పేర్కొన్నాడు. ఫెదరర్ సెమీస్లో కిర్గియోస్తో తలపడనున్నాడు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







