విజేతగా నిలిచిన ఫెదరర్ మరోసారి నాదల్పై
- March 16, 2017
టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ మరోసారి విజేతగా నిలిచాడు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ తలపడ్డారు. వీరిద్దరూ ఇలా తలపడటం ఇది 36వ సారి కావడం విశేషం. అయితే 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రోజర్ ఫెదరర్ పైచేయి సాధించాడు. వరుస సెట్లలో 6-2, 6-3తో నాదల్పై ఫెదరర్ అలవోక విజయాన్ని సాధించాడు.
తొలి సెట్లో ఫెదరర్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు నాదల్. అయితే రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్నా మ్యాచ్ జేజారిపోయింది.
నాదల్పై విజయం సాధించడంతో రోజర్ ఫెదరర్ సెమీస్కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం నాదల్ మీడియాతో మాట్లాడాడు.
'ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలోఓటమి పాలయ్యాను. అది గెలవాల్సిన మ్యాచ్. ప్రస్తుతం ముగిసిన మ్యాచ్లో ఫెదరర్ నాకంటే చాలా బాగా ఆడాడు' అని నాదల్ పేర్కొన్నాడు. ఫెదరర్ సెమీస్లో కిర్గియోస్తో తలపడనున్నాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









