సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’
- March 16, 2017
శ్రీ మూవీ మేకర్స్ పతాకం పై రిమ్మలపూడి వీర గంగాధర్ నిర్మించిన సినిమా ‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’. ఈ చిత్రంతో రవిచంద్ర కన్నికంటి దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన కథనాయకుడు అరుణ్ మహి, అమీర్ పేట్ లో ఫేమ్ అశ్విని జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రవిచంద్ర కన్నికంటి ఓ చక్కటి లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. దాదుపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దాంతో పాటే పోస్ట్ పొడక్షన్ కూడా ముగించుకొని ఇటీవలే లహరి మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేశారు ఈ చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ రేటింగ్ ఇచ్చారని దర్శకులు రవిచంద్ర ప్రకటించారు. అలానే వేసవి కానుకగా ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ కమీడియన్ 30 ఇయర్స్ పృధ్వీ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్-వాసు బొజ్జా, సంగీతం – సుమన్ జూపూడి, ఎడిటిర్-కె.రవిందర్ బాబు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







