ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న కింగ్
- September 25, 2015
కింగ్ హమాద్ నిన్న, ఈద్ అల్ అధా సందర్భంగా సఖిర్ ప్యాలెస్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు న్విహించారు. ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, తొలి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, సీనియర్ రూలింగ్ కుటుంబ సభ్యులు, మంత్రులు, కువైట్ రాయబారులు మరియు అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమామ్, కింగ్ హమాద్ని అల్లా రక్షించాలనీ, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండేలా చూడాలని, ఆయన జీవితంలో సంతోషం ఎల్ల వేలలా ఉండేలా చేయాలని, హమాద్ నేతృత్వంలో కింగ్డమ్ ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. దేశం కోసం ప్రాణాలర్పించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని కింగ్ హమాద్ ప్రార్థించారు. ఈద్ అల్ అధా సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపినవారికి అభినందనలు తెలియజేశారు కింగ్ హమాద్.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









