జయలలిత గురించి అడిగా శోభన్బాబు దగ్గరికెళ్లి
- March 18, 2017
'కిటుకులు తెలిసిన చిటపట చినుకులు.. ' అంటూ 'ఘరానా మొగుడు' సినిమాలో కుర్రకారును హీటెక్కించిన వాణీ విశ్వనాథ్ ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది. అప్పట్లో టాలీవుడ్ సీనియర్ హీరోలందరితోనూ ఆడిపాడింది ఈ నాయిక. ఎన్టీఆర్, ఏఎన్నార్తో పాటు సోగ్గాడైన శోభన్బాబుతో కూడా నటించింది. శోభన్బాబుతో తాను ఎలా ఉండేదాన్ననే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ''శోభన్బాబుగారు చాలా స్వీట్ హార్ట్. ఆయన దగ్గరికెళ్లి జయలలితగారి గురించి అడిగేదాన్ని. అలా అడగటం తప్పా? రైటా? నాకు తెలిసేది కాదు. కానీ అడిగేదాన్ని. ఆయన నెమ్మదిగా సమాధానం చెప్పేవారు. 'జయలలితగారు చాలా తెలివైనవారు.
చాలాపుస్తకాలు చదువుతారు' అని ఆయనే చెప్పారు.'' అని వాణీ విశ్వనాథ్ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ గురించి చెబుతూ..'' రామారావుగారితో 'సమ్రాట్ అశోక' చేసేటప్పుడు చాలా భయంగా సెట్కి వెళ్లా. అంత పెద్ద మనిషి 'మీరు' అని పిలవగానే ఉలిక్కిపడ్డా. ఆయన మర్యాదను చూసి ఆశ్చర్యపోయా.
ఇప్పటికీ నేను చంటిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరినైనా 'మీరు' అనే సంబోధిస్తా. అందుకు కారణం రామారావుగారే. ఆయన దగ్గర ఆ సంస్కారం నేర్చుకున్నా.'' అని వివరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







