జయలలిత గురించి అడిగా శోభన్‌బాబు దగ్గరికెళ్లి

- March 18, 2017 , by Maagulf
జయలలిత గురించి అడిగా శోభన్‌బాబు దగ్గరికెళ్లి

'కిటుకులు తెలిసిన చిటపట చినుకులు.. ' అంటూ 'ఘరానా మొగుడు' సినిమాలో కుర్రకారును హీటెక్కించిన వాణీ విశ్వనాథ్ ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది. అప్పట్లో టాలీవుడ్ సీనియర్ హీరోలందరితోనూ ఆడిపాడింది ఈ నాయిక. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు సోగ్గాడైన శోభన్‌బాబుతో కూడా నటించింది. శోభన్‌బాబుతో తాను ఎలా ఉండేదాన్ననే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ''శోభన్‌బాబుగారు చాలా స్వీట్‌ హార్ట్‌. ఆయన దగ్గరికెళ్లి జయలలితగారి గురించి అడిగేదాన్ని. అలా అడగటం తప్పా? రైటా? నాకు తెలిసేది కాదు. కానీ అడిగేదాన్ని. ఆయన నెమ్మదిగా సమాధానం చెప్పేవారు. 'జయలలితగారు చాలా తెలివైనవారు.
చాలాపుస్తకాలు చదువుతారు' అని ఆయనే చెప్పారు.'' అని వాణీ విశ్వనాథ్ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ గురించి చెబుతూ..'' రామారావుగారితో 'సమ్రాట్‌ అశోక' చేసేటప్పుడు చాలా భయంగా సెట్‌కి వెళ్లా. అంత పెద్ద మనిషి 'మీరు' అని పిలవగానే ఉలిక్కిపడ్డా. ఆయన మర్యాదను చూసి ఆశ్చర్యపోయా.
ఇప్పటికీ నేను చంటిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరినైనా 'మీరు' అనే సంబోధిస్తా. అందుకు కారణం రామారావుగారే. ఆయన దగ్గర ఆ సంస్కారం నేర్చుకున్నా.'' అని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com