బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్
- March 21, 2017
ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొనేందుకు ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. రూ.339 రీఛార్జ్ చేయడం ద్వారా రోజుకు 2జీబీ డేటాను అందించనుంది. ‘జియోతో సహా ఇతర టెలికాం సంస్థల కన్నా అతి తక్కువ ధరకు డేటాను అందించనున్నాం. రూ.339లకే రోజుకు 2జీబీ డేటాను నెల రోజుల పాటు పొందవచ్చు’ అని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సంజీవ్ త్యాగి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు త్యాగి వెల్లడించారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









