పెరిగిన పసిడి ధర
- March 22, 2017
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పాటు స్థానికంగా కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర బాగా పెరిగింది. పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.29,350కి చేరింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండి ధర రూ.41వేల మార్కు దాటిపోయింది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.550 పెరిగి రూ.41,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.25శాతం పెరిగి 1,247.30 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 0.20 శాతం పెరిగి 17.55డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









