విజయవాడ 63 అడుగుల మహాగణపతి నిమజ్జనం ప్రారంభం

- September 27, 2015 , by Maagulf
విజయవాడ 63 అడుగుల మహాగణపతి నిమజ్జనం ప్రారంభం

నవ్యాంధ్రలో తొలిసారిగా 63 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టితో తయారు చేసిన మహాగణపతి విగ్రహ నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమైంది. డూండి గణేశ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం 10 రోజులుగా పూజలందుకుంటోంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా మహాగణపతిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. విగ్రహంలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన నీటి పంపుల ద్వారా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. నిమజ్జనం కోసం మొత్తం లక్ష లీటర్ల నీటిని వినియోగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com