44 దొంగతనాలకి పాల్పడ్డ గ్యాంగ్ అరెస్ట్
- March 25, 2017
రియాద్: 10 మంది సభ్యులు గల గ్యాంగ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియాద్లో వీరిని అరెస్ట్ చేసినట్లు సిటీ పోలీస్ వెల్లడించారు. మొత్తం 44 దొంగతనాల్లో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు గ్రూపులుగా విడిపోయి ఈ గ్యాంగ్ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతోంది. ఈ గ్యాంగ్లో మొత్తం ఏడుగురు సౌదీలు ఉండగా, ఓ సిరియన్, ఓ యెమెన్, ఇంకొకరు గుర్తు తెలియని దేశస్తుడు ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ళ వయసులోపలే ఉన్నారంతా. 4 సౌదీ రియాల్స్ విలువైన దొంగతనాలకు పాల్పడ్డారు వీరంతా. గోల్డ్ జ్యుయెలరీ, ఖరీదైన స్టోన్స్, ఎలక్న్రాటిక్ డివైజెస్, పర్సనల్ డాక్యుమెంట్స్, క్యాష్, లగ్జరీ కార్లను నిందితులు దొంగిలించారు. సిటీలో జరిగే ఎక్కువ దొంగతనాల్లో విదేశీయుల హస్తమే ఉంటోందని పోలీసులు వివరించారు. సెక్యూరిటీ అథారిటీస్ ఎప్పటికప్పుడు విస్తృతమైన తనఙఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకో వైపున అక్రమంగా దేశంలో ఉంటోన్నవారికి 90 రోజుల అమ్నెస్టీని ప్రకటించడం జరిగింది. మార్చ్ 29 నుంచి ఈ అమ్నెస్టీ అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









