ప్రయాణీకులు సీటు బెల్టుని విస్మరిస్తే డ్రైవర్ కు 400 దిర్హాంల జరిమానా
- March 26, 2017
దుబాయ్: " సుబ్బి పెళ్ళి..వెంకీ చావుకి వచ్చిందన్నట్లుగా " తమ పరిస్థితి మారిందని యుఎఇ లో డ్రైవర్లు వాపోతున్నారు. తమ వాహనంలో ప్రయాణిస్తున్న వినియోగదారుడు ఎవరైనా పొరబాటున తమ సీట్ బెల్ట్ నడుంకు కట్టుకోపోతే, వారు చేసిన తప్పిదానికి డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకోవాలి. ప్రతి ప్రయాణీకుడికి 400 ధిర్హాంల చొప్పున జరిమానా ఉంటుందని ఒక సీనియర్ అధికారి శనివారం తెలిపారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ అధిపతి జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జాఫెయిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకవేళ డ్రైవర్ తన సీట్ బెల్ట్ ధరించి ఉన్నప్పటికి వెనుక సీట్లలలో ఉన్నఇతర ప్రయాణీకులు సీట్ బెల్ట్ లను ధరించి ఉండకపోతే, ఆ తప్పిదానికి డ్రైవర్ వారందరి తరుపున జరిమానా చెల్లించాలని ఆయన చెప్పారు. ట్రాఫిక్ క్రమశిక్షణ సమస్యలు మరియు ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర అమలు జూలై మొదటి వారంలో ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని జనరల్ అల్ జాఫెయిన్ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









