15 యూఎస్ కంపెనీలపై ఆంక్షలు విధించనున్న ఇరాన్
- March 26, 2017
అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ రేథియాన్, యునైటెడ్ టెక్నాలజీస్, ఐటీటీ, ఒష్కోష్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. యూఎస్కు చెందిన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ఇజ్రాయెల్కు సహకరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఆ కంపెనీల కాంట్రాక్ట్లను రద్దు చేయడంతో పాటు వాటి ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి పోగ్రామ్కు సాంకేతిక సహకారం అందిస్తున్న చైనా, ఉత్తర కొరియా, యూఏఈలకు చెందిన 11 కంపెనీలపై అమెరికా రెండు రోజుల కిందట ఆంక్షలు విధించింది. దీనికి బదులుగా అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







