మరో కొత్త ఆడియో కంపెనీ తెలుగునాట
- March 29, 2017
తెలుగు సినిమాలకు సంబంధించి ఆడియో కంపెనీలు ఉన్నట్టుగా ఇండిపెండెంట్ మ్యూజిక్ కి గాను కొత్త ఆడియో కంపనీ వెలసింది. ఉగాది సందర్భంగా దర్శకేంద్రులు కే రాఘవేంద్ర చేతుల మీదుగా "ఇండీ విండ్స్ రికార్డ్స్" పేరుతో ప్రారింభపడిన ఈ ఆడియో కంపెనీకి ప్రముఖ ఫ్లూటిస్ట్, ఆదిశంకర వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఫ్లూట్ నాగరాజ్ (నాగ్ శ్రీవత్స) వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తుండగా మణి నాగరాజ్, లలిత్ తాళ్లూరి కార్యనిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు.
ఇండీ విండ్స్ రికార్డ్స్ వ్యవస్థాపకులు ఫ్లూట్ నాగరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మన దేశంలో సినిమా సంగీతానికి ఉన్నంత ప్రాధాన్యం ఇండిపెండెంట్ మ్యూజిక్ కి లేకపోవడానికి కారణం సరైన వేదిక లేకపోవడమే.
మా స్వీయసంగీతంతో పాటు ఔత్సాహిక యువకళాకారుల సంగీతానికి కూడా ఒక వేదికను కలిపించాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన సంస్థ ఇది. దర్శక దిగ్గజం కే రాఘవేంద్రరావుగారు మాకు శ్రేయోభిలాషి, గురువు, మిత్రులు. వారి చేతుల మీదుగా మా కంపెనీ లోగో ఆవిష్కారం కావడం శుభసూచికంగా భావిస్తున్నాం", అన్నారు.
"ఏప్రిల్ 15 న ఢిల్లీలో మా ఇండీ విండ్స్ పై మా తొలి ఆల్బం "త్రివేణు" ఆవిష్కృతమౌతోంది. నాతో పాటూ హిందూస్తాని వేణుగాన విద్వాంసులు రూపక్ కులకర్ణి, పాశ్చాత్య వేణు విద్వాంసులు హెన్రీ టర్నియర్లు కలిసి నిర్వహిస్తున్న ఈ "త్రివేణు" ఫ్యూజన్ సంగీతంలో ఒక కొత్త అధ్యాయం", అని ప్రకటించారు నాగరాజ్.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









