ఉచిత క్రెడిట్ కార్డులు ఎస్బీఐ ఖాతాదారులకు
- March 29, 2017క్రెడిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వినియోగదారులు ఈ ఉచిత క్రెడిట్ కార్డులను పొందొచ్చని, నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చని ఎస్బీఐ చీఫ్ తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 'ఉన్నతి' అనే పథకం ద్వారా ఈ ఉచిత క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా..
ఖాతాలో రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు నిల్వ ఉంచుతున్న వారికి ఈ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ఖాతాల్లో కనీస నిల్వలు ఉండాల్సిందేనని ఇటీవల ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎస్బీఐ ప్రకటనపై ఖాతాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేక వచ్చింది. 'మా డబ్బుపై మీ పెత్తనం ఏమిటి?' అని ఎస్బీఐని నిలదీశారు. ఈ నేపథ్యంలో... వినియోగదారులే ఖాతాల్లో నిల్వలు ఉంచేలా చేసేందుకు ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









