జ్యువెలరీ మాఫియా ఉగాది 'పేరు'తో
- March 29, 2017
చైత్ర శుద్ధ పాడ్యమి రోజొచ్చే ఉగాదిని ఈసారి విదియ రోజు జరుపుకోవడమే ఒక విచిత్రం. ఇలా పండగెప్పుడనే గొడవ ప్రతి సంవత్సరమూ ఉండేదే. అయితే ఈసారి పండగ పేరులో కూడా వివాదం పుట్టేసింది. ఈ ఉగాది నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం పేరేంటన్న చర్చతోనే పండగంతా గడిచిపోతోంది. హేవిళంబి అని ఒకరు.. కాదు హేమలంబి అని ఇంకొకరు.. ఇదోరకం వాదులాట.
విళంబి అంటే ఆలస్యం చేయకపోవడం అని అర్థం. ఇది తర్వాతొచ్చే తెలుగు సంవత్సరం. ఇవ్వాళ మొదలైన తెలుగు సంవత్సరం పేరు హేవిళంబి. దాన్ని కాస్తా హేమలంబిగా మార్చేశారని.. వేళ్ళాడే బంగారం అంటూ దానికో అర్థం కూడా కనిపెట్టి జ్యువెలరీ వ్యాపారం పెంచుకోవడం కోసం ఒక కుట్రే జరిగిపోతోందని కొందరు ప్రవచన కర్తలు చెప్తున్న మాట.
ఇవ్వాళ బంగారం కొంటే ఈ సంవత్సరం మొత్తం మీ ఇంట్లో బంగారం వేళ్ళాడుతుందంటూ అటువైపు నుంచి ప్రచారం కూడా జరిగిపోతోంది.
అక్షయ తృతీయ పేరుతో జరిగే 'దోపిడీ' లాంటిదే ఇది కూడా ! చివరకు పంచాంగాలు, తెలుగు క్యాలెండర్ల మీద కూడా 'హేమలంబి'గానే అచ్చయిపోయింది. పాత పెద్దబాలశిక్ష తిరగేస్తే.. అందులో వుండే 60 తెలుగు సంవత్సరాల జాబితాలో తప్పితే.. మరెక్కడా 'హేవిళంబి' అనే పేరు కనిపించదు మరి!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







