జ్యువెలరీ మాఫియా ఉగాది 'పేరు'తో
- March 29, 2017
చైత్ర శుద్ధ పాడ్యమి రోజొచ్చే ఉగాదిని ఈసారి విదియ రోజు జరుపుకోవడమే ఒక విచిత్రం. ఇలా పండగెప్పుడనే గొడవ ప్రతి సంవత్సరమూ ఉండేదే. అయితే ఈసారి పండగ పేరులో కూడా వివాదం పుట్టేసింది. ఈ ఉగాది నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం పేరేంటన్న చర్చతోనే పండగంతా గడిచిపోతోంది. హేవిళంబి అని ఒకరు.. కాదు హేమలంబి అని ఇంకొకరు.. ఇదోరకం వాదులాట.
విళంబి అంటే ఆలస్యం చేయకపోవడం అని అర్థం. ఇది తర్వాతొచ్చే తెలుగు సంవత్సరం. ఇవ్వాళ మొదలైన తెలుగు సంవత్సరం పేరు హేవిళంబి. దాన్ని కాస్తా హేమలంబిగా మార్చేశారని.. వేళ్ళాడే బంగారం అంటూ దానికో అర్థం కూడా కనిపెట్టి జ్యువెలరీ వ్యాపారం పెంచుకోవడం కోసం ఒక కుట్రే జరిగిపోతోందని కొందరు ప్రవచన కర్తలు చెప్తున్న మాట.
ఇవ్వాళ బంగారం కొంటే ఈ సంవత్సరం మొత్తం మీ ఇంట్లో బంగారం వేళ్ళాడుతుందంటూ అటువైపు నుంచి ప్రచారం కూడా జరిగిపోతోంది.
అక్షయ తృతీయ పేరుతో జరిగే 'దోపిడీ' లాంటిదే ఇది కూడా ! చివరకు పంచాంగాలు, తెలుగు క్యాలెండర్ల మీద కూడా 'హేమలంబి'గానే అచ్చయిపోయింది. పాత పెద్దబాలశిక్ష తిరగేస్తే.. అందులో వుండే 60 తెలుగు సంవత్సరాల జాబితాలో తప్పితే.. మరెక్కడా 'హేవిళంబి' అనే పేరు కనిపించదు మరి!
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









