భారత ఐటీకి సింగపూర్ షాక్
- April 03, 2017
భారత ఐటీ సంస్థలు, ప్రొఫెనల్స్ వీసాలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించగా, ఇప్పుడు అదే బాటలో మరో దేశం నడుస్తోంది. తమ దేశంలో ఉన్న భారత ఐటీ కంపెనీలు స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది.
భారత ఐటీ ప్రొఫెషనల్స్కు జారీ చేసే వీసాలను గణనీయంగా తగ్గించింది. దీంతో ఐటీ కంపెనీలు ఇతర దేశాల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇది వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని భావిస్తున్న భారత ప్రభుత్వం.. కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(సీఈసీఏ) పునఃసమీక్షపై పునరాలోచన చేస్తోంది.
సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం హెచ్సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ కంపెనీలపై ప్రభావం చూపనుంది.
ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా.. గత సంవత్సరం మొదటి నుంచీ వీసాల జారీని గణనీయంగా తగ్గించారని, స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం కంపెనీలకు స్పష్టంచేసిందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వెల్లడించారు.
ఎకనామిక్ నీడ్స్ టెస్ట్ అంటూ ఆర్థిక కారణాలను సాకుగా చూపుతూ సింగపూర్ భారత ఐటీ ప్రొఫెషనల్స్కు వీసాలను నిరాకరిస్తోంది. సీఈసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఓ భారత అధికారి తెలిపారు. అమెరికా, తర్వాత సింగపూర్ కూడా వీసాలు తగ్గించడంపై భారత ఐటీ సంస్థలు, ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







