మోటారు బైకులపై ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న యువకులు అరెస్ట్
- April 03, 2017
మస్కట్ : కళాశాలలో హాయిగా చదువుకోవాల్సిన కుర్రోళ్ళు విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు హాబీగా మార్చుకొన్నారు చివరకు కట కటాల పాలయ్యారు. విలయత్ లోని సోహ్ర లో ప్రజల మధ్యలో ఉండి దొంగతనం చేయడం వెనువెంటనే రెప్పపాటులో అక్కడనుంచి మోటార్ బైకులపై వేగంగా పారిపోతున్న ఓ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలు మరియు నేర పరిశోధనల యొక్క డైరెక్టరేట్ జనరల్ పరిధిలో ఆ ముగ్గురు నిందితులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు సోహ్ర ఫలాజ్ అల్ ఖ్యాబైల్ ప్రాంతాలలో (16 , 17 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు) యువకులు ఉత్తర బత్తినహ్ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఒక అధికారి తెలిపారు.వారు ప్రజలలే లక్ష్యంగా చేసుకొనే మోటారుబైకులపై నగరం చుట్టూ తిరుగుతూ దొంగతనం కోసం ఆ యువకుల అనేక సందర్భాల్లో పాల్గొన్నారు. "వారు ప్రజల నుండి మొబైల్ మరియు ఇతర వస్తువులు లాక్కొని పారిపోతుంటారని మరియు చోరీ చేసిన స్థలం నుండి తప్పించుకోవడానికి మోటార్ బైకులు ఉపయోగిస్తారని ఆ అధికారి తెలిపారు. పరిశోధనలు ఆధారంగా ఆ యువకులను అరెస్టు చేశామని వారిపై ఉన్న ఆరోపణలు నేరాలు గూర్చి తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపనున్నట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







