మోటారు బైకులపై ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న యువకులు అరెస్ట్
- April 03, 2017
మస్కట్ : కళాశాలలో హాయిగా చదువుకోవాల్సిన కుర్రోళ్ళు విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు హాబీగా మార్చుకొన్నారు చివరకు కట కటాల పాలయ్యారు. విలయత్ లోని సోహ్ర లో ప్రజల మధ్యలో ఉండి దొంగతనం చేయడం వెనువెంటనే రెప్పపాటులో అక్కడనుంచి మోటార్ బైకులపై వేగంగా పారిపోతున్న ఓ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలు మరియు నేర పరిశోధనల యొక్క డైరెక్టరేట్ జనరల్ పరిధిలో ఆ ముగ్గురు నిందితులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు సోహ్ర ఫలాజ్ అల్ ఖ్యాబైల్ ప్రాంతాలలో (16 , 17 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు) యువకులు ఉత్తర బత్తినహ్ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఒక అధికారి తెలిపారు.వారు ప్రజలలే లక్ష్యంగా చేసుకొనే మోటారుబైకులపై నగరం చుట్టూ తిరుగుతూ దొంగతనం కోసం ఆ యువకుల అనేక సందర్భాల్లో పాల్గొన్నారు. "వారు ప్రజల నుండి మొబైల్ మరియు ఇతర వస్తువులు లాక్కొని పారిపోతుంటారని మరియు చోరీ చేసిన స్థలం నుండి తప్పించుకోవడానికి మోటార్ బైకులు ఉపయోగిస్తారని ఆ అధికారి తెలిపారు. పరిశోధనలు ఆధారంగా ఆ యువకులను అరెస్టు చేశామని వారిపై ఉన్న ఆరోపణలు నేరాలు గూర్చి తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపనున్నట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







