ఒమన్లో గడువు తీరిన మందుల పట్టివేత
- April 03, 2017
మస్కట్: 200 రకాలకు పైగా గడువు తీరిన వెటరినరీ మెడిసిన్స్, సోహార్ మరియు బురౌమిలో సీజ్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్ వెల్లడించింది. మినిస్ట్రీ, కొన్ని ఫామ్స్ అలాగే వెటరినరీ ఫెసిలిటీస్పై బతినా గవర్నరేట్ పరిధిలో దాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ తనిఖీల్లో గడువు తీరిన మందులు లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అనంతరం, చట్టపరమైన చర్యలకోసం అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఆయా మందుల్ని కలిగి ఉన్న సంస్థలకు నోటీసులు జారీచేయడం కూడా జరిగింది. గడువు తీరిన మందుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







