భారతీయులకు ఫ్రీగా వీసా మలేసియా కీలక నిర్ణయం
- April 04, 2017
మలేసియాకు వచ్చే భారతీయులకు ఒక్క పైసా కూడా తీసుకోకుండానే వీసాలను మంజూరు చేయనున్నట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు.
ఇప్పటి వరకు ఏ మలేసియా ప్రధానీ భారత్ లో పర్యటించలేదు. దీంతో భారత్ లో పర్యటించిన తొలి మలేసియా ప్రధానిగా నజీబ్ రజాక్ రికార్డు సృష్టించినట్లయింది. తన పర్యటనలో భాగంగా భారత్ తో ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్, మలేసియా మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, భారతీయ భాషలను మాట్లాడేవారు మలేసియాలో ఎంతోమంది ఉన్నారని రజాక్ చెప్పారు. ఇక్కడి సంస్కృతి, ఆహారం మలేసియాలోని అన్ని ప్రాంతాల్లో మిళితమైందని తెలిపారు.
ఇక మీదట ఆన్ లైన్ ద్వారా భారతీయులు మలేసియా వీసా నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే, 48 గంటల్లోనే అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. తాను భారతీయ సినిమాలకు అభిమానిని పేర్కొన్నారు. భారత్ తో మరింత ద్వైపాక్షిక బంధాన్ని తాము కోరుకుంటున్నామని, విద్య, వైద్య, ఉగ్రవాద వ్యతిరేక, ఆహార భద్రత విభాగాల్లో భారత్ సహకారాన్ని కోరుతున్నామని వివరించారు.
తాజా వార్తలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!







