భారతీయులకు ఫ్రీగా వీసా మలేసియా కీలక నిర్ణయం
- April 04, 2017
మలేసియాకు వచ్చే భారతీయులకు ఒక్క పైసా కూడా తీసుకోకుండానే వీసాలను మంజూరు చేయనున్నట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు.
ఇప్పటి వరకు ఏ మలేసియా ప్రధానీ భారత్ లో పర్యటించలేదు. దీంతో భారత్ లో పర్యటించిన తొలి మలేసియా ప్రధానిగా నజీబ్ రజాక్ రికార్డు సృష్టించినట్లయింది. తన పర్యటనలో భాగంగా భారత్ తో ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్, మలేసియా మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, భారతీయ భాషలను మాట్లాడేవారు మలేసియాలో ఎంతోమంది ఉన్నారని రజాక్ చెప్పారు. ఇక్కడి సంస్కృతి, ఆహారం మలేసియాలోని అన్ని ప్రాంతాల్లో మిళితమైందని తెలిపారు.
ఇక మీదట ఆన్ లైన్ ద్వారా భారతీయులు మలేసియా వీసా నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే, 48 గంటల్లోనే అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. తాను భారతీయ సినిమాలకు అభిమానిని పేర్కొన్నారు. భారత్ తో మరింత ద్వైపాక్షిక బంధాన్ని తాము కోరుకుంటున్నామని, విద్య, వైద్య, ఉగ్రవాద వ్యతిరేక, ఆహార భద్రత విభాగాల్లో భారత్ సహకారాన్ని కోరుతున్నామని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







