అమెరికాలో ఎస్పీ షాక్ ఇచ్చిన దొంగలు..!
- April 05, 2017
తెలుగు ఇండస్ట్రీలో గాన గంధర్వుడు గా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ మద్య పలు మార్లు వార్తల్లో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఆ మద్య బాలుకి సంగీత మాంత్రికుడు ఇళయరాజకు పెద్ద వైరమే జరిగింది. ఆ మద్య తెలుగు సినిమాలపై తనదైన స్టైల్లో స్పీచ్ దంచికొట్టారు. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరోసారి వార్తల్లోకి ఎక్కారు..అయితే ఈసారి మాత్రం ఎలాంటి కాంట్రవర్సీతో కాదు..ఆయన బ్యాగు పోగొట్టుకున్న బాధ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు చేదు అనుభవం ఎదురైంది. హూస్టన్ లో 'ఎస్పీబీ 50' టూర్ లో ఉండగా ఆయన బ్యాగ్ చోరీకి గురైనట్టు ఆయన ఫేస్ బుక్ లో పెట్టారు.
ఆ బ్యాగు లో పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులూ ఉన్నాయన్నారు. కాకపోతే సమయానికి హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో డూప్లికేట్ పాస్ పోర్టును పొందానని, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానుల ఆందోళన చెందారని కాకపోతే ఇప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. 'యువర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ సేఫ్ అండ్ హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్.. గాడ్ బ్లెస్ యూ ఆల్' అని ఎస్పీబీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, సియాటిల్, లాస్ ఏంజిల్స్, అట్లాంటాలో బాలు ప్రస్తుతం పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







