అమెజాన్లో ఉద్యోగాలు!
- April 05, 2017
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. గృహోపకరణాలు, ఫర్నిచర్ కేటగిరీలో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా భారత్లో ప్రత్యేకంగా ఏడు గోదాములు నిర్మించనుంది. వీటిలో పనిచేసేందుకు దాదాపు 1200 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఇందుకోసం మొత్తం 5బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. భారత్లో డిమాండ్ ఆధారంగా మొత్తం 33 డెలవరీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే భారత్లో ఆ సంస్థకు 27 గోదాములు ఉన్నాయి. తాజాగా మరో 7 గోదాముల నిర్మాణంతో వాటి సంఖ్యను 34కు విస్తరించి పది రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించనుంది.
భారత్లోని మొత్తం 150 నగరాల్లో వినియోగదారులకు భారీ గృహోపకరణాలు, ఫర్నిచర్ సామగ్రిని వేగంతో పాటు నమ్మకంగా అందజేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అమెజాన్ ఇండియా వైస్ప్రెసిడెంట్ అఖిలేశ్ సక్సేనా తెలిపారు.
గృహోపకరణాల జాబితాలోని ఏసీలు, ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లకు భారీగా గిరాకీ ఉండటంతో దీనిపై ఆ సంస్థ దృష్టిపెట్టింది. గతేడాది ఈ కేటరిగీకి చెందిన వస్తువుల అమ్మకాల్లో 200శాతం వృద్ధి ఉన్నట్టు సంస్థ తెలిపింది. కొత్తగా ఈ గోదాములను తెలంగాణ, కర్ణాటక, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ్బంగ రాష్ట్రాల్లో ఏర్పాటుచేయనున్నట్టు సక్సేనా తెలిపారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







