యూఏఈ రెసిడెంట్స్కి ఉచిత హెల్త్ చెకప్
- April 06, 2017
వరల్డ్ హెల్త్ ఆన్గనైజేషన్ - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడిక్లినిక్ మిడిల్ ఈస్ట్, ఉచిత వైద్య పరీక్షల్ని అందించింది. బ్లడ్ కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బిఎంఐ, బ్లడ్ ప్రెజర్ పరీక్షల్ని యూఏఈ రెసిడెంట్స్కి ఏప్రిల్ 5న నిర్వహించింది. ఈఏడాది 'డిప్రెషన్ - లెట్స్ టాక్' అనే థీమ్తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డిప్రెషన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో డిప్రెషన్ మీద ఫోకస్ పెట్టామని నిర్వాహకులు తెలిపారు. డిప్రెషన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలనీ, ఇది రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారనుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిథులు, వైద్యులు తెలిపారు. మెడి క్లినిక్ మిడిల్ ఈస్ట్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ పెటీ లౌబ్సెర్ మాట్లాడుతూ, డిప్రెషన్తో బాధపడుతున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలనీ, అలాగే కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్తో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!! దుబాయ్: పాదచారుల భద్రతను మరింత మెరుగుపర�
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







